పదవి విరమణ తరువాత బ్రతకడానికి ఎక్కువ ఆదాయం పొందేందుకు ఇటీవల చాలా మంది కూడా చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే వారు పలు రకాల పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి  మంచి పలు ఆకర్షణీయమైన పథకాలు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన పథకాన్ని కూడా కేంద్రం ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌-ధన్‌ (PM-SYM) పేరుతో ఈ పథకాన్ని గతంలోనే కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది.అయితే ఇక ఈ పథకంలో భాగంగా దంపతులు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. కేవలం నెలకు చెరోక వంద రూపాయలు (మొత్తం రూ. 200) చెల్లిస్తే ఆ తర్వాత ఏటా రూ. 72,000 పెన్షన్‌ ని వారు పొందొచ్చు.అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే..కార్మికులు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, చాకలివారు, రిక్షా పుల్లర్లు, భూమిలేని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఇంకా అలాగే తోలు కార్మికులు వంటి వారు ఈ పథకం పొందడానికి అర్హులు.


ఇంకా అలాగే నెలవారీ ఆదాయం రూ. 15,000 అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల ఇతర వృత్తుల వారు కూడా ఈ పథకానికి అర్హులే. ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తికి 30 ఏళ్లు ఉంటే దంపతులు ఇద్దరు నెలకు రూ. 200 చెల్లిస్తే సంవత్సరానికి రూ. 1200 అవుతుంది. వీరిలో ఇక 60 ఏళ్లు నిండిన వ్యక్తి ఏటా రూ. 36,000 పెన్షన్‌ పొందొచ్చు.ఒకవేళ పింఛన్‌ పొందే సమయంలో చందదారుడు కనుక చనిపోతే లబ్ధిదారుని భాగస్వామికి అతను పొందే పెన్షన్‌లో మొత్తం 50 శాతం అందిస్తారు. ఇక కుటుంబ పెన్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే వస్తుంది. ఆసక్తి ఉన్న వారు మీకు దగ్గరల్లోనీ కామన్‌ సర్వీస్‌ సెంటర్స్‌ స్కీమ్ (CSC)కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా మొబైల్ ఫోన్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఇంకా అలాగే ఆధార్ నంబర్ కలిగి ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: