ప్రపంచంలో వున్న టాప్ కంపెనీలు అన్ని కూడా ఉద్యోగులను తొలగిస్తుండడం ఎంతగానో ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఉద్యోగుల తొలగింపు అనేది ఇంటర్నేషనల్ కంపెనీలకు మాత్రమే పరిమితం కాలేదు, ఇండియన్ కంపెనీలు కూడా ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. ఇండియాకి చెందిన ఫేమస్ ఎడ్‌టెక్‌ కంపెనీ కూడా బైజుస్‌ ఉద్యోగులకు షాకిచ్చింది.ఇదిలా ఉంటే గతంలో మొత్తం 2500 మందిని తొలగించిన ఈ యూనికార్న్‌ కంపెనీ.. తాజాగా మరో 1000 మందిని తొలగించిందని సమాచారం తెలుస్తోంది. డిజైన్‌, ఇంజినీరింగ్‌ ఇంకా అలాగే ప్రొడక్షన్‌ విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం తెలుస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.గతంలో ఉద్యోగులను తొలగించే సమయంలో ఫ్యూచర్ లో ఉద్యోగుల తొలగింపు ఉండవని ఉద్యోగులకు హామి ఇచ్చారు. 


అయితే కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే మరో 1000 మందిని తొలగించడం జరిగింది.ఇక బైజూస్‌ కంపెనీ ముఖ్యంగా ఆపరేషన్స్‌, లాజిస్టిక్స్‌, కస్టమర్‌ కేర్‌, ఇంజినీరింగ్‌, సేల్స్‌, మార్కెటింగ్‌ ఇంకా అలాగే కమ్యూనికేషన్స్‌ వంటి విభాగాలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించే ఆలోచనలో ఉందని సమాచారం తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బైజూస్‌ ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆఫీసులకు వచ్చిన వారికి నేరుగా పింక్‌ స్లిప్‌ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. అలాగే మరికొంత మందికి వాట్సాప్‌ లేదా నేరుగా కాల్స్‌ చేసి గూగుల్‌ మీట్‌లో కనెక్ట్‌ అవ్వాలని సూచించి తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నోటీస్‌ పీరియడ్ ముగిసన తర్వాత ప్యాకేజీ చెల్లిస్తామని బైజూస్‌ కంపెనీ తెలిపినట్లు సమాచారం తెలుస్తుంది.ఈ విధంగా చాలా కంపెనీలు కూడా వివిధ కారణాల వల్ల ఉద్యోగులను తొలగిస్తున్నందు వల్ల చాలా మంది కూడా రోడ్డున పడుతున్నారు. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగం నుంచి తీసేస్తుందో అని చాలా మంది భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: