సాధారణంగా వర్షకాలం, చలికాలం అంటేనే ఎన్నో చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. వర్షాకాలం కాస్త తేమగా ఉండి మృధువైన చర్మంపై రాషెస్ వస్తుంటాయి, ఇక చలికాలం మాత్రం చర్మం పొడిబారడం, మొద్దు బారడం కనిపిస్తుంది. కొన్ని చోట్ల తెల్లగా పాలిపోయి అందవిహీనంగా ఉంటుంది. ఇవేగాక ఈ కాలంలో ప్రధానంగా వేధించే మరో సమస్య పాదాలు పగలడం. ఇది మరింత బాధను కలిగిస్తుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ బాధ నుంచి బయటపడే ఛాన్స్ ఉంది.


మీ పాదాలను కొన్ని గంటల పాటు తోలు బుట్లలలో చుట్టి ఉంచడం వలన అవి ఎలా ఉంటాయో ఎపుడైనా ఆలోచించారా? నిజానికి, అవి ఒక నరకంలో ఉన్న భావనకు లోనవుతాయి. చాలా మంది పాదాల గురించి అస్సపు ఆలోచించరు. పాదాలకు మర్ధన అనగానే బహుశా మీ జేబుకు చిల్లు పడినట్లే అన్న భావన మనసులో మొదలవుతుంది. అయితే ఇంట్లోనే దశల వారీగా ఆయుర్వేద మర్ధన మార్గనిర్దేశకాల సహాయంతో మీ పాదాలకు సౌకర్యవంతమైన అనుభూతిని అందించవచ్చు.  మీ పాదాలు మృదువుగా ఉండాలంటే.. బయటే కాక ఇంట్లో ఉన్నప్పుడూ చెప్పులేసుకోవడం తప్పనిసరి. ఇంటిలోపల, ఇంటి వెలుపలికి వేరు వేరు చెప్పులు వాడటం మంచిది. అలాగే స్నానం చేసేటప్పుడు రెండు నిమిషాలు అదనంగా పాదాల కోసం కేటాయించి పాదాలను రుద్దుకుంటే అరికాలిలో ఉన్న మట్టి తొలగిపోయి పాదం మృదువుగా తయారవుతుంది. 


ఇదే కాకుండా తేనెలో తేమనందించే యాంటి బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ఇవి పాదాల పగుళ్లను పోగొట్టి మృదువుగా మారుస్తాయి. పావు బకెట్ నీళ్లలో నాలుగు చెంచాల తేనె కలిపి పాదాలను పావుగంగ పాటు నానబెట్టాలి. తర్వాత పాదాలను గట్టిగా రాస్తూ కడిగితే పగుళ్లు పోతాయి.  పాదాల పగుళ్ల నివారణకు బియ్యం పిండి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం మూడు చెంచాల బియ్యం పిండి, రెండు చెంచాల తేనె, చెంచా ఆపిల్ సిడర్ వెనిగర్ కలపాలి. గోరువెచ్చని నీళ్లలో పది నిమిషాల పాటు పాదాలను ఉంచి ఈ మిశ్రమంతో స్రబ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


పాదాల శుభ్రత కోసం ఫ్యాన్సీ, బ్యూటీ పార్లర్లలో ఓ రాయిని అమ్ముతుంటారు. వీటిని కూడా వాడొచ్చు. రాత్రిపడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు ఉన్న మట్టి, సూక్ష్మజీవులుపోయి కాలు శుభ్రపడి పాదాలకు వచ్చే ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసుకోవచ్చు.  వేళ్లమధ్యలో ఉన్న తేమను గుడ్డతో తుడుచుకుని, తడి ఆరిన తరువాతే పడుకోవాలి. అలాకాని పక్షంలో వేళ్ల మధ్యలో ఫంగస్‌, అంటువ్యాధులు సోకే అవకాశముంది. క్రమం తప్పకుండా కాలిగోళ్లను కత్తిరించుకోవాలి. గోళ్లను ఏమాత్రం పెరగనివ్వకూడదు.

Image result for healthy feets

రోజూ కనీసం అరగంట నడవాలి. నడక కాలికి మంచిది. రక్తప్రసరణ పెంచుతుంది. తద్వారా అనేక రకాల పాదాల వ్యాధులను నివారించవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. మీకు కావాల్సిన వస్తువులు ఒక చిన్న టబ్ లో వెచ్చని నీటిని, కొంచెం అల్లం, ఉప్పు, పాదాలను తుడవడానికి ఒక టవల్ మరియు మర్ధన చేయడానికి ఎంపిక చేసుకున్న నూనె (కొబ్బరి నూనె, నువ్వులు లేదా ఆవాల నూనె). కానీ, వేసవి కాలంలో ఆవాల నూనె వాడకూడదు ఎందుకంటే అది శరీరంలో వేడిని ఉత్పత్తి చేయవచ్చు. 

మీ పాదాలను టబ్ నుండి భయటకు తీయాలి మరియు వాటిని పొందికగా ఆరనివ్వాలి. ఇపుడు కొంచెం నూనె తీసుకొని మీ పాదాలకు పట్టించాలి అయితే మర్ధన చేసేపుడు చేతులకి మరియు కాళ్ళకి మధ్య రాపిడి చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి.  ప్రతి పాదానికి సుమారు 15 - 20 నిమిషాల పాటు మర్ధన చేయాలి. మసాజ్ ఎలా చేయాలో కింద వివరించడం జరిగింది. 


చెంచా ఆలివ్ నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించినా ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెని పాదాలకు పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కాళ్ల పగుళ్లు మాయమైపోయి మీ పాదాలు అందంగా మారుతాయి. ట్రై చేసి చూడండి.




మరింత సమాచారం తెలుసుకోండి: