చలికాలం వచ్చింది అంటే చాలు చుండ్రు శని పట్టినట్టు పడుతుంది. ఈ చుండ్రు సమస్య ఎంత అనుకున్న సరే అస్సలు తగ్గదు. చుండ్రు అంటే భయపడే రోజులు వచ్చెశాయి. అయితే చుండ్రు కూడా రెండు రకాలు ఉంటుంది. వాటిల్లో వాతం కారణంగా వచ్చే పొడి చుండ్రు ఒకరకం. ఈ చుండ్రు పొడి పొడిగా రాలుతూ ఉంటుంది. 

                               

ఈ పొడి చుండ్రుకు వైద్యం.. 

                           

మూడు చెంచాల త్రిఫల చూర్ణాన్ని ఒక లీటరు నీళ్లల్లో వేసి మరిగించాలి. కషాయం 800 మి. లీటర్లు మిగిలే దాకా కాచి చల్లార్చాలి.. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కషాయంతో తలను శుభ్రపరచాలి. వారానికి ఒకటి రెండు సార్లయినా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత 'దూర్వాది కేరం' అనే తైలాన్ని రోజుకు ఒకసారి చొప్పున వారానికి 4 రోజులైనా వాడాలి. ఇలా రెండు మాసాల పాటు చేయాలి. దీనికి తోడు పావు చెంచా తులసి పొడిని ఉదయం, పావు చెంచా పొడిని రాత్రి తీసుకోవాలి. ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది. 

 

ఇంకా రెండో రకం చుండ్రు.. 

 

కఫం కారణంగా వచ్చే ఫంగస్‌ చుండ్రు. ఇందులోనూ పొడి రాలినా, కపాలమంతా జిడ్డుగా ఉంటుంది. ఒకరోజు స్నానం చేయకపోయినా మట్టిమట్టిగా అనిపిస్తుంది. వీరు 'వెట్పలా తైలం' తలకు పట్టించి, గంట తర్వాత స్నానం చేయాలి. వారానికి మూడు రోజులైనా ఇలా చేయాలి. ఆ తర్వాత 'ఖదిరారిష్టం' పొడిని 3 చెంచాలు ఉదయం, 3 చెంచాలు రాత్రికి భోజనం తర్వాత వేసుకోవాలి. ఇలా నెలరోజులు పాటు కొనసాగించాలి. వెంటనే చుండ్రు తగ్గిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: