బాదం గింజలను తీసుకొని వాటిని నానబెట్టాలి. బాగా నానిన తర్వాత వాటి తొక్క తీసి గింజలను పేస్ట్లా తయారుచేయాలి. ఆపై కొద్దిగా పాలు కలిపి ముఖానికి, మెడకు రాసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఫేస్ ప్యాక్లు చర్మానికి ఇనస్టంట్ బ్రైట్ నెస్ అందించడం మాత్రమే కాకుండా చర్మాన్ని అందంగా, మృదువుగానూ మారుస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ ఫేస్ ప్యాక్స్ మాదిరిగానూ ఉపయోగించవచ్చు. దీనికోసం మీకు నచ్చిన, మీరు పాటించడానికి వీలుగా ఉన్న ఫేస్ ప్యాక్ను వారానికి రెండు సార్లు వేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.బాదం గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణను అందిస్తుంది. అలాగే నిర్జీవంగా మారిన చర్మకణాలకు జీవం పోస్తుంది. పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి.
రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్లో టీస్పూన్ చందనం పొడి వేసి సరిపడినంత రోజ్ వాటర్ కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత మసాజ్ చేసుకొంటున్నట్టుగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్నమృతకణాలు సైతం తొలగిపోతాయి.ఓట్ మీల్ సహజసిద్ధమైన స్క్రబ్లా పనిచేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఇతర పోషకాలు చర్మానికి మెరుపునిస్తాయి. ఓట్ మీల్ సహజసిద్ధమైన క్లెన్సర్గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చందనం, రోజ్ వాటర్ చర్మానికి ఇనస్టంట్ గ్లోను అందిస్తాయి.
టేబుల్ స్పూన్ టమాటా గుజ్జులో టేబుల్ స్పూన్ పెరుగు వేసి మిశ్రమంగా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.వీటితో తయారుచేసిన మిశ్రమం ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.