ఏ కాలం వచ్చిన అమ్మాయిల పగుళ్లు తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే మడమల సున్నితంగా మారటం లేదు? ఈ సమస్య కారణంగా చాలామంది మహిళలు వారికీ నచ్చిన చెప్పులు వేసుకోవాలన్న సిగ్గుపడుతుంటారు. అవి కనిపించకుండా ఉండే షూస్ ని మాత్రమే వారు వేసుకుంటుంటారు. అయితే ఆ సమస్య లేకుండా ఉండాలంటే ఎలానో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


2 చెంచాల ఆముదం, 2 చెంచాల కొబ్బరి నూనె తీసుకొని అందులో అర చెంచా పసుపు కలిపి రోజూ పాదాలకు రాసుకొంటే పగుళ్ల సమస్య క్రమంగా తగ్గుతుంది.


గుప్పెడు వేపాకు, చిటికెడు చొప్పున పసుపు, సున్నం కలిపి మెత్తగా నూరి, అందులో 2 చెంచాల ఆముదం కలిపి పాదాలకు పట్టించిన పగుళ్ల సమస్య నయం అవుతుంది. 


గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం వేసి పాదాలను ఆ నీటిలో ఉంచి తర్వాత ఫ్యూమ్ స్టోన్ తో మడమలు శుభ్రంగా రుద్దితే అక్కడ చేరిన మలినాలు, మృతకణాలు తొలగటమే గాక పగుళ్లు రావు.


పగిలి ఇబ్బంది పెడుతున్న మడమలకు గుప్పెడు పండిన బొప్పాయి గుజ్జు లేదా రుబ్బిన గోరింటాకును రాసిన బాగా ఎండిన తర్వాత నీటితో కడిగితే మంచి ఉపశమనం లభిస్తుంది.


చూశారుగా ఈ చిట్కాలు పాటించి మీ పాదాలను అందంగా మార్చుకోండి. పాదాల పగుళ్లు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: