క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న‌దేశంలో కూడా జోరుగా విజృంభిస్తుండ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు కంటిన్యూ అవుతోన్న లాక్ డౌన్‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పొడిగించేలా సూచ‌న‌లు ఇస్తున్నారు. తాజాగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌తో మోదీ నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో మోదీ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఏప్రిల్ 14న ఎట్టి ప‌రిస్థితుల్లోనూ లాక్‌డౌన్ ఎత్తివేసే ఆలోచ‌న లేద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశార‌ట‌. ఇక లాక్‌డౌన్ పొడిగింపు నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశాయి.

 

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ లాక్‌డౌన్ పొడిగించాల‌ని ప‌లు రాష్ట్రాలు సూచిస్తున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ పొడిగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. తాను ఈ విష‌యాన్ని నేరుగా మోదీకే చెప్పాన‌న్నారు. ఇక పంజాబ్ ఇప్ప‌టికే లాక్ డౌన్ ఏప్రిల్ 30 వ‌ర‌కు పొడిగించింది. ఇక మోదీ లాక్ డౌన్ పొడిగింపు నేప‌థ్యంలో మోదీ ఏప్రిల్ 11న అన్ని రాష్ట్రాల సీఎంల‌తో మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ స‌మావేశం ఏర్పాటు చేస్తున్నారు.

 

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపున‌కే మోడీ మొగ్గు చూపుతున్న విష‌యం స్ప‌స్ట‌మైంది. ఈ విష‌యంలో అన్ని పార్టీలు, నాయ‌కుల స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా తీసుకుంటున్నామ‌ని మోదీ తెలిపారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ముందుగా మ‌రో 15 రోజులు పోడిగించి .. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నిర్ణ‌యం తీసుకోనున్నార‌ట‌.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: