ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాస్తోంది.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌ర‌ణాలు 149 ఉండ‌గా.. ఇక నిన్న ఒక్క రోజే 33 మంది చ‌నిపోయారు. ఇక దేశ‌వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారు 402 మంది ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ‌లో క‌రోనా ముందు నుంచి జోరుగా ఉండ‌గా ఏపీలో గ‌త నాలుగు రోజులుగా వీర‌విహారం చేస్తోంది. ఏపీలో ఇప్ప‌టికే అన్ని జిల్లాల్లోనూ క‌రోనా విజృంభిస్తోంది. ఇక అనంత‌పురం జిల్లాలో కాస్త సేఫ్ జోన్ ఉంద‌ని అనుకుంటుండ‌గా ఇప్పుడు అనంత‌పురం జిల్లాలోనూ క‌రోనా విజృంభించింది.

 

ఇక బుధ‌వారం ఒక్క రోజే ఈ జిల్లాలో ఏడు పాజిటివ్ కేసులు బ‌య‌ట ప‌డ్డాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 13కు చేరుకుంది. విచిత్రం ఏంటంటే తాజాగా క‌రోనా పాజిటివ్‌తో మృతిచెందిన ఓ వ్య‌క్తికి వైద్యం చేసిన న‌లుగురు డాక్ట‌ర్ల‌కు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇది పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఇక మ‌క్కా నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు క‌రోనా పాజిటివ్ రాగా... క‌ళ్యాణ‌దుర్గం నుంచి ఢిల్లీ వెళ్లిన మ‌రో వ్య‌క్తికి కూడా పాజిటివ్ వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో హిందూపురం, క‌ళ్యాణ‌దుర్గం, అనంత‌పురం అర్బ‌న్‌లో ఈ కేసులు న‌మోదు అయ్యాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: