క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న‌దేశంలో గ‌త ఐదారు రోజులుగా తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచంలో కోవిడ్ బాధితులు 15 ల‌క్ష‌ల‌కు చేరుకున్నారు. ఇక మ‌న‌దేశంలో ఈ కేసులు ఇప్ప‌టికే 5 వేల‌కు చేరుకున్నాయి. తాజాగా గురువారం ఉద‌యం 9 గంట‌ల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ప్ర‌కారం చూస్తే మ‌న‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 5734 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా సోకి 166 మంది మృతిచెందారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు 5095 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా సోకి కోలుకున్న వారు 473 మంది ఉన్నారు. ఇక గ‌త 24 గంట‌ల్లో 17 మంది మృత్యువాత ప‌డ్డారు. ఇక దేశ‌వ్యాప్తంగా మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 1000కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు ఏపీలో 329, తెలంగాణ‌లో 364కు చేరుకోగా.. ఏపీలో 4, తెలంగాణ‌లో 11 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇక అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 72 మంది మృతిచెందారు. ఏదేమైనా ఈ లెక్క‌లు చూస్తుంటే మ‌న‌దేశంలోనూ క‌రోనా చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: