ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా ఇది శుభవార్తే.. కరోనా కేసుల తాజా బులిటెన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రజలకు కాస్త ఊరట కలిగించేలా ఉంది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు ఏపీలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదు. మొత్తం 217 మంది శాంపిళ్లను పరిశీలించగా, అందులో అన్నీ నెగెటివ్ వచ్చాయి. ఇవాళ కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా రాష్ట్రంలో కర్నూల్ జిల్లా అత్యధికంగా 75 కేసులతో తొలి స్థానంలో ఉంది. 49 కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 348కి చేరింది. ఇందులో నుంచి 9 మంది దవాఖానల్లో చికిత్స పొంది కోలుకుని ఇంటికి చేరారు. విశాఖ జిల్లాలో మరో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. అయితే