కరోనా కష్టకాలంలో మనలను ఎవరైనా ఆదుకుంటున్నారు అంటే అది డాక్టర్స్ మాత్రమే . వైద్యుడు దేవుడితో సమానం అంటారు . అటువంటి స్థితిలో ఉన్న డాక్టర్స్ పై ఓ నలభై ఏళ్ళ వ్యక్తి దాడి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . ఢిల్లీ లోని సపదార్ గూంజ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా డాక్టర్స్ పై నలభై ఏళ్ళ వయసున్న వ్యక్తి దాడి చేసాడు .

 

 

వివరాలలోకి వెళితే సపదార్ గూంజ్ఆ సుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్స్ కరోనా వైరస్ తమనుండి ఇతరులకు వ్యాధిని వ్యాపింప చేస్తున్నారని మండిపడిన ఆ వ్యక్తి వారిపై దాడి చేసాడు . దాడికి గురైన డాక్టర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు . కాగా అతడు ఓ పండ్ల వ్యాపారి అని ఆ ఇద్దరు  డాక్టర్స్ అక్కడికి పండ్లను కొనుగోలు చేసేందుకు అతని వద్దకు వచ్చారని . ఈ క్రమంలో వారు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని వ్యాధి వ్యాప్తికి కారణం మీలాంటి వారివల్లే అని మండిపడుతూ దాడికి పాల్పడ్డాడని యువతులు వాపోయారు 

మరింత సమాచారం తెలుసుకోండి: