వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. తమ కస్టమర్లకు ప్రతి రీచార్జ్ పై కమిషన్ అందించే పథకాన్ని లాంచ్ చేసింది వొడాఫోన్ ఐడియా యాజమాన్యం. కరోనా, లాక్ డౌన్ ఇబ్బందుల్లో ఉన్నతమ కస్టమర్ల సౌలభ్యం కోసం “రీఛార్జ్ ఫర్ గుడ్” పేరుతో ఈ పథకాన్ని లాంచ్ చేసింది. అయితే ఇతర ప్రీపెయిడ్ కస్టమర్లకు కూడా ఆన్లైన్ రీచార్జ్ చేస్తే కమిషన్ అందివ్వనుంది. వొడాఫోన్ ఐడియా, వొడాఫోన్ లేదా ఐడియా కస్టమర్లు వేరే వారికి చేసిన రీచార్జిపై ఏకంగా 6 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది.
ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇది ప్రతి వొడాఫోన్, ఐడియా కస్టమర్లకు వర్తిసుందని, స్నేహితుడు, కుటుంబం లేదా ఆన్లైన్ రీఛార్జ్ ఎలాగో తెలియని లేదా ఇంటర్నెట్కు ప్రాప్యత లేని ఎవరికైనా రీఛార్జ్ చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. మై వొడాఫోన్, మై ఐడియా యాప్ ద్వారా మాత్రమే రీచార్జ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే రీచార్జ్ చేసిన 96 గంటల్లో వినియోగదారుల ఖాతాకు క్యాష్ బ్యాక్ జమ అవుతుందని పేర్కొంది.