రాష్ట్రాల‌కు నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్ర‌లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్రమోడీని డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ ఏప్రిల్ 14న ముగుస్తుంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలా.. వ‌ద్దా..?  అన్న దానిపై ప్ర‌ధాని నేరంద్ర మోడీ శ‌నివారం మ‌ధ్యాహ్నం అన్నిరాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన ప్ర‌ధాని వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకున్నారు. ఈ మేర‌కు ఏప్రిల్ 14 త‌ర్వాత లాక్‌డౌన్ పొడిగింపు, త‌దిత‌ర అంశాల‌పై కీల‌క నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అయితే.. ఈ వీడియ‌లో కాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌ధాని మోడీతోపాటు ముఖ్య‌మంత్రులు మాస్క్‌ల‌ను ధ‌రించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తోపాటు మ‌రికొంద‌రు ముఖ్య‌మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రాల‌కు నిధుల‌ను విడుదల చేయాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. 

 

క‌రోనా వైర‌స్‌క‌ట్ట‌డికి కేంద్రం నుంచి నిత్యం స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని ముఖ్య‌మంత్రులు కోరిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా.. లాక్‌డౌన్‌పై మోడీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని దేశ ప్ర‌జ‌లంద‌రూ ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7447కు చేరుకుంది. ఇక మ‌ర‌ణాల సంఖ్య 239కు చేరుకుంది. అయితే..24 గంట‌ల్లో 1035 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 40  మంది మృతి మృతి చెందారు. ఆస్ప‌త్రుల్లో 6656 మంది చికిత్స పొందుతున్నారు. 643మంది కోలుకున్నారు. అయితే.. ముందుముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది. దేశంలో మొత్తం 720 జిల్లాలు ఉన్నా.. దాదాపుగా 400 జిల్లాలో క‌రోనా వైర‌స్‌ప్ర‌భావం పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.  ఇదే స‌మ‌యంలో దేశంలోని 133 జిల్లాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఈ నేప‌థ్యంలో మోడీ నిర్ణ‌యం కోసం దేశ ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: