నిన్నటివరకు పాజిటివ్ కేసులు లేని ఖమ్మం జిల్లా లో ఒక్కసారిగా రెండు కేసులు నమోదు కావడం జిల్లాను  కలవరపెడుతోంది. మొన్న ఖమ్మం లోని పెద్ద తండా నుండి కరోనా పాజిటివ్ రావడం తో ఆ తండాకు సంబందించిన దాదాపుగా 60  మందిని హోమ్ క్వారంటైన్ కి తరలించిన విషయం తెలిసినదే . ఇప్పుడు కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు జిల్లాలో నమోదు కావడంతో జిల్లా వాసులు ఆందోళన పడుతున్నారు .

 

ఖమ్మం జిల్లాలోని ఓ వృద్దుడికి కరోనా పాజిటివ్ రావడం తో అతనిని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కి తరలించారు అదేవిధంగా రక్త నమూనాలను టెస్టింగ్ పంపగా పాసివ్ వచ్చింది .ఇదిలా ఉండగా కల్లూరు మండలంలోని కప్పలమంద గ్రామం లో ఓ వ్యక్తికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్య అధికారులు గుర్తించారు . అతనిని ఇప్పటికే హైదరాబాద్ గాంధీ హాస్పిటకి తరలించారు సదరు వ్యక్తి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు అయితే దగ్గరలోని తమ బంధువుల ఇళ్లకు పలుమార్లు వెళ్లినట్లు గుర్తించారు . వీరికి సోషల్ కాంటాక్ట్స్ ద్వారా వచ్చినట్లు ధికారులు అనుమానిస్తున్నారు 



మరింత సమాచారం తెలుసుకోండి: