ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే ఈ కేసులు 17.81 వేల‌కు చేరుకుంది. ఇక మ‌ర‌ణాలు 1.08 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక అగ్ర రాజ్యం అమెరికాలో క‌రోనా దెబ్బ‌కు అంద‌రూ విల‌విల్లాడుతున్నారు. అమెరికా లాంటి అగ్ర‌రాజ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు 5.33 ల‌క్ష‌ల కేసులు ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే అక్క‌డ మ‌ర‌ణాలు 20 వేలు దాటేశాయి. గ‌త మూడు రోజులుగా అక్క‌డ స‌గ‌టున 2 వేల మంది మృతి చెందుతున్నారు.

 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఉన్న భార‌తీయుల్లో 40 మంది చ‌నిపోయిన‌ట్టు లెక్క‌లు చెపుతున్నాయి. వీరిలో కొంద‌రు అక్క‌డ సెటిల్ అయిన వారు ఉండ‌గా.. మ‌రికొంద‌రు భార‌తీయులు కూడా ఉన్నారు. ఇక మ‌న‌దేశంలో కూడా కరోనా పాజిటివ్‌ల సంఖ్య 8 వేలు దాటింది. లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా కొనసాగుతున్న కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 909 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆలాగే మరో 34 మంది మరణించినట్లు తెలిపింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: