భారత్‌లో కోవిడ్‌-19 విజృంభిస్తోంది. క‌రోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా సోమ వారం ఉదయం నాటికి కరోనా మరణాల సంఖ్య 315కు చేర‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

 

మొత్తంగా 9,234 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, వీరిలో 1081 మంది కరోనా నుంచి కోలుకుని ద‌వాఖాన‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  7,8347 కు చేరింది. కాగా గడచిన 24 గంటల్లో కరోనాతో 35 మంది మ‌ర‌ణించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

 

కరోనా సంబంధిత మరణాలు, పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 149 మంది బలయ్యారు. మధ్యప్రదేశ్‌లో 36 మంది, గు జరాత్‌లో 25 మంది, ఢిల్లీలో 24, పంజాబ్‌లో 11 మంది, తమిళనాడులో 11 మంది క‌రోనాతో మరణించారు.  అత్యధికంగా మహారాష్ట్రలో 1985 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: