కరోనా కారణంగా కేంద్రప్రభుత్వం చూచిస్తున్న సూచనలను తుంగలో తొక్కుతున్నారు. తాజాగా ఓ హోటల్ యజమానిని మాస్క్ ధరించమన్నందుకు అతడికి ఎక్కడా లేనంత కోపంతో ఊగిపోయాడు మరియు చితక బాదాడు. ఈ సంఘటన జమల్‌పూర్‌ పరిధిలోని ఫరూఖ్‌నగర్‌లో జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఓ దుకాణదారుడు గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నాడు. అతడి క్షేమం కోరిన అతని భార్య హోటల్ మూసివేయమని లేకపోతే మాస్క్ ధరించమని వేడుకొంది. కోపగించుకున్న అతను ఆమెపై కోపంగా చూసి షాప్ కి వెళ్ళిపోయాడు. 

 

మళ్లి హోటల్ నుండి తిరిగివచ్చిన అతను భార్యతో ఆ విషయం గురించి గొడవ జరిగింది. ఆ గొడవలో తన తల్లితో కలసి భార్యపై కొట్లాటకు దిగాడు . నడిరోడ్డు పై అందరు చూస్తుండగా చితకబాదాడు. కానీ ఎవరు ఈ విషయం గురించి అడగలేదు. మరసటిరోజున హోటల్ యజమాని భార్య పోలీసులను ఆశ్రయించింది విషయం తెలుసుకున్న పోలీస్ లు కేసునమోదు చేసి హోటల్ ని మూతవేసారు . సదరు హోటల్ యజమాని  అందులో వైన్ అమ్ముతున్నట్లు నిర్దారించారు . అతనిపై క్రిమినల్ కేసు పెట్టి విచారిస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: