దేశం లో నానాటికి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మర్కజ్ నిజాముద్దీన్ జమాత్ సంఘటనల అనంతరం కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా గడచినా 24 గంటలలో దేశంలో 796 కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వచ్చిన కేసులతో కలుపుకొని 9152 కేసులు నమోదు అయ్యినట్లు తాజా హెల్త్ బులిటెన్ లో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి తెలియజేసారు.

 

ఇప్పటివరకు దేశంలో 857 కేసులు నెగటివ్ వచ్చి డీఛార్జి అయ్యారు అని తెలిపారు. గడచినా 24 గంటల్లో 35 మరణించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా కరోనా టెస్టులు చేశామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలియజేసారు. ఓ పక్క ఆంధ్రాలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్యా నానాటికి పెరుగుతూనే ఉన్నాయ్ . అందరిలో 438 పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణ లో 500 పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి 

మరింత సమాచారం తెలుసుకోండి: