ఏపీ మంత్రి కొడాలి నానికి, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌రరావుకు చిర‌కాల రాజ‌కీయ వైరం ఉంది. టీడీపీలో ఉన్న‌ప్ప‌టి నుంచే వీరిద్ద‌రికి అస్స‌లు పొసిగేది కాదు. ఉమా  టీడీపీలో ఉన్న‌ప్పుడు నాని టీడీపీలో ఉన్నా కూడా ఉమా గుడివాడ‌లో అడుగు పెట్టే సాహ‌సం చేసే వారు కాదు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు సైతం ఉమాకే  ప్ర‌యార్టీ ఇవ్వ‌డంతో కొడాలి నాని వైసీపీలోకి వెళ్లిపోయారు. 2014లో వైసీపీ ఓడినా గుడివాడ‌లో ఆయ‌న గెలిచారు. ఇక మొన్న ఎన్నిక‌ల్లో గెలిచిన నానికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

 

ఇక ఉమా మంత్రిగా ఉన్న‌ప్పుడు నానిని ఎక్కువుగా టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఎప్పుడూ తీవ్ర‌మైన మాట‌ల యుద్ధం న‌డుస్తూ ఉండేది. ఇక గ‌తంలోనే కొడాలి నాని దేవినేని ఉమ త‌న సొంత వ‌దిన‌నే చంపార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇక సోమ‌వారం ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్ర‌బాబు సీఎం అయ్యార‌ని.. ఇక దేవినేని ఉమా అనే వ్య‌క్తి అన్న చ‌నిపోతే త‌న సొంత వ‌దిన‌నే బాతూ రూంలో ఎలా ?  ఉరితీయాలా ? అన్న కుట్ర‌లు చేశాడ‌ని ఆరోపించారు.

 

ఇక నాని ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా నాడు  మంత్రిగా ఉన్న ఉమా అన్న దేవినేని వెంక‌ట ర‌మ‌ణ రైలు ప్ర‌మాదంలో చ‌నిపోగా.. ఆ త‌ర్వాత వెంట‌నే ఆయ‌న భార్య కూడా చ‌నిపోయారు. దీనిపై చాలా మంది సందేహాలు వ్య‌క్తం చేసేవారు. ఉమాయే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం త‌న వ‌దిన‌ను చంపేశాడ‌ని ప్ర‌త్య‌ర్థులు ఆరోపించారు. ఇప్పుడు నాని చేసిన ఈ ఆరోప‌ణ మ‌రో సంచ‌ల‌న‌మైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: