లాక్‌ డౌన్‌ తో సినిమా ఇండ‌స్ట్రీ పూర్తిగా మూత‌బ‌డింది. షూటింగ్‌ల‌న్నీ బంద్ అవ్వ‌డంతో హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు.  అయితే ఈ  ఖాళీ సమయాన్ని చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు తమ భవిష్యత్ ప్రాజెక్టులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే పనిలో నిమగ్నమై ఉ న్నారు.  తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నిర్మాతగా మారాలని యోచిస్తున్నార‌ట‌. లాక్ డౌన్ ముగిసిన వెంటనే కొ రటాల నిర్మతగా తన సినిమాని ఎనౌన్స్ చేస్తారని ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్ వినిపిస్తోంది. 

 

తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోన్న ఓ నూతన దర్శకుడికి, కొరటాల దర్శకత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే చిన్న బడ్జెట్ చిత్రంతో కొరటాల నిర్మాతగా మారనున్నారు. పైగా శివనే స్వయంగా ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వి వరాలు త్వరలో తెలియనున్నాయి.  

 

మాటల రచయితగా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో ప్రముఖంగా వినిపించే పేరు కొరటాల శివ. ఇప్పుడు కొరటాల సినిమా అంటే ఓ బ్రాండ్ అనే స్థాయికి వెళ్ళిపోయింది ఆయన సినిమా. అందుకే చోటా హీరోల దగ్గర నుంచి ఎన్టీఆర్, మహేశ్‌, మెగాస్టార్ వరకు ఆయనతో సినిమా చెయ్యటానికి ఆసక్తి చూపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: