ఏపీలో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. బాబోరి పచ్చ బ్యాచ్ మాత్రం అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం మినహా ఏం చేయడం లేదు. ఇక చంద్రబాబు ఎంచక్కా హైదరాబాద్లో కూర్చొని ఏపీ మంత్రులు అన్నట్టు హోం క్వారంటైన్లో ఉన్నారే తప్పా ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడం లేదు. అప్పుడెప్పులో మధ్యలో ఓ ప్రెస్మీట్ తూతుమంత్రంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన బాబోరు మంగళవారం ఉదయం మోదీ ప్రెస్మీట్ పెట్టిన వెంటనే తాను కూడా ప్రెస్మీట్ పెట్టి మోదీ మంత్రం జపిస్తూ మోదీకి జై కొట్టారు.
ఇక తనకు అలవాటైన రీతిలోనే ఈ పొద్దున్నే తానే మోదీ ఆఫీస్కు ఫోన్ చేసి మాట్లాడాలని మోదీతో మాట్లాడాలని చెప్పానని... వెంటనే మోదీ ఫోన్ చేసి తనతో మాట్లాడారని చెప్పారు. అలాగే జోన్ల గురించి కూడా మోదీకి తానే లేఖ రాశానని చెప్పారు. మొత్తానికి బాబోరు అధికారంలో లేకుండానే ఇంత చెప్పుకున్నారు. అదే బాబోరు అధికారంలో ఉంటే అసలు దేశం కాదు.. ప్రపంచానికే కరోనా ఎలా తగ్గాలో తాను సలహాలు ఇస్తానని చెప్పుకుంటారు.
మోదీ చంద్రబాబుతో మాట్లాడడం పెద్ద గొప్పేం కాదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ చాలా మందితో మాట్లాడుతున్నారు. మీడియాధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు రిక్వెస్ట్ మేరకు ఆయనతో మాట్లాడి ఉండోచ్చు. అయితే వెంటనే బాబోరు తానే మోదీకి సలహా ఇచ్చా అనే రేంజ్లో చెప్పుకోవడం కాస్త విచిత్రమే మరి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple