కర్నూలో ఇవాళ ఒకరు చనిపోయారు దీనితో కరొనతో కర్నూల్ లో ఇప్పటివరకు రెండు కరోనా కేసులు చనిపోయారు. కర్నూల్ జిల్లా లో ఇప్పటి వరకు 93 కేసులు నమోదు అయ్యాయి .  గాంధిగాలీ 7 ,బుధవార  పేట ఏరియాలో 6 కేసులు నమోదు అయ్యాయి ,కర్నూల్ లో అత్యధికంగా 23 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలో లో మొదటిగా నమోదు అయినా రాజస్థాన్ వ్యక్తి ని ఇవాళ మధ్యాహ్నం జిల్లా వైద్యాధికారి వీర పాండ్యన్  డీఛార్జి చేశారు. 92 కేసులు ప్రస్తుతం వైద్యాన్ని పొందుతున్నారు.

 

ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు 473 కేసులు నమోదు అయ్యాయి. కాగా 9 కరోనా మరణాలు మరియు 14 మంది కోలుకొని డీఛార్జి అయ్యారు. గడచిన 24  గంటల్లో 2010 రక్తనమూనాలను పరీక్షించగా 41 కేసులు పాజిటివ్ వచ్చాయి . గుంటూరు జిల్లాలో అత్యధికంగా 109 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 17 , తూ.గో 17 , చిత్తూరులో 23 , పా.గో లో 23  ,కడపలో 36 , కృష్ణ 44 , నెల్లూరు 54 , ప్రకాశం 42 , విశాఖలో 20 కేసులు చొప్పున నమోదు అయ్యాయి .  

మరింత సమాచారం తెలుసుకోండి: