ఎన్నారై స్వాతి.. ఈపేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మోర్మోగుతోంది. భారత్ను కీర్తిస్తూ....ఇటీవల ఆమె విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అగ్రగామి దేశం, అన్ని రకాల వసతులున్న దేశం, హెలీక్యాప్టర్ లతోనే అంబులెన్స్లను నడపగలిగిన దేశం తీరా ఇ వ్వాల కరోనాతో అతలాకుతలం అవుతోందని, ఇక్కడి ప్రజలు వైరస్ తో వణికిపోతున్నారని, మందుల కోసం భారత్ లాంటి దేశంపై ఆదారపడాల్సి వస్తోందని ఆమె అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
అయితే స్వాతి వ్యాఖ్యలపై అటు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న ఎన్నారైలు తీవ్రంగా మండిపడ్డారు. అమెరికాలో ఉంటున్నప్పుడు అ మెరి కాను ప్రేమించాలని, గౌరవించాలని చురకలంటించారు. భారతదేశం గొప్పతనాన్ని తెలియజేయడం కోసం అమెరికాను కించపర్చాల్సిన అవసరం లే దని మండిపడ్డారు. భారతదేశం, అమెరికా రెండు గొప్పవేనని స్వాతి గుర్తించాలని కూడా సూచించారు. ఒకడుగు ముందుకేసి అమెరికాలో స్వాతిపై కేసు కూడా పెట్టారు. ఈనేపథ్యంలోనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని, అమెరికాను కించపర్చడం తన ఉద్దేశంకాదని స్వాతి క్షమాపణ చెప్పడంతో ఈ గొడవకు ఫుల్స్టాప్ పడింది.