తుప్పు నాయుడిది ముగిసిన చరిత్ర. విపత్కర సమయంలో ప్రజలకు దన్నుగా నిలవాల్సింది పోయి హైదరాబాద్ లో తలదాచుకున్నాడు. రేపు ఏం మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తాడు. ముఖాముఖి తలపడే దమ్ములేక సోషల్ మీడియాలో పిడకలు వేయిస్తున్నాడు. 70 ఏళ్లొచ్చినా చీకట్లో గోతులు తవ్వడం మానడు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య‌సాయి చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 

 

పాతికసార్లు ప్రాధేయ పడితే ప్రధాని నరేంద్ర మోడీ కాల్ చేసి ఉంటారని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ రాజ్యసభ స భ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మోడీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా కాల్‌ చేసి మాట్లాడారని గు ర్తు చేశారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారు. పరామర్శిస్తారు.  ఆయన వినమ్రత అది. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే న వ్వొస్తోందని ఎద్దేవా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: