దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు శరవేగంగా విస్తరిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే మే 3వ తేదీ వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 20వ తేదీ వరకు నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఇక్కడ జోన్లను ఎత్తివేయనున్నారు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 170 హాట్ స్పాట్ జోన్లను గుర్తించింది.
కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు దేశంలో 12380 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 414 మంది మృతిచెందారు. ఇక 1488 ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం దేశంలో 10477 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple