కరోనా వైరస్ నేపధ్యంలో క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వారికి ఆర్ధికంగా అండగా నిలవాలని ప్రభుత్వ౦ భావిస్తుంది. క్వారంటైన్‌ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్లే వారికి రూ. 2 వేలు ఆర్థికసాయ౦ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. 

 

పౌష్టికాహారం కోసం ఈ ఆర్థికసాయం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. చార్జీల నిమిత్తం అదనంగా రూ.600 వారికి అందజేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. క్వారంటైన్‌ సమయంలో రోజుకు ఒక్కో వ్యక్తికి రూ.600 ఖర్చు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: