కరోనా నేపథ్యంలో భారతదేశ ఆర్థకి వ్యవస్థ అంతా ట్రాక్ తప్పింది. ఇప్పటికే అన్ని రంగాలు లాక్డౌన్ నేపథ్యంలో కోట్లాది రూపాయలు నష్టపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఎప్పటికి గాడిలో పడుతుందో కూడా అర్థంకాని పరిస్థితి. ఈ క్రమంలోనే అన్ని రంగాలకు నిధుల కొరత లేకుండా చేసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మొత్తం రు. 50 వేల కోట్ల నిధులు అందుబాటగులోకి తేనున్నారు.
రెపో రేటు అలాగే ఉంచారు. రివర్స్ రెపో రేటును 25 బేస్ పాయింట్లు తగ్గించనున్నారు. మార్కెట్లపై భారం లేకుండా ఉండేందుకు నాబార్డ్తో పాటు వివిధ సంస్థలకు రు. కోట్లలో నిధులు కేటాయించారు. నాబార్డ్కు రు. 25 వేల కోట్లు, ఎస్ఐడీబీఐకు రు. 15 వేల కోట్లు, నేషనల్ హౌసింగ్ కార్పొరేషన్కు రు. 10 వేల కోట్లు కేటాయించారు. అలాగే 2021-22లో దేశ జీడీపీ 7.4 ఉంటుందని అంచనా వేశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple