కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొందని.. అయితే ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా మనదేశంలో బ్యాంకులు అందిస్తోన్న సేవలు ప్రశంసనీయమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత జీడీపీ 1.9 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇంకా చెప్పాలంటే జీ 20 దేశాల్లో భారత జీడీపీనే అధికంగా ఉందన్న విషయం కూడా ఆయన గుర్తు చేశారు. ఇక జీడీపీలో 3.2 శాతం ద్రవ్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు కూడా ఆయన చెప్పారు. ఇక ఆర్బీఐ నాలుగు ఉపశమన చర్యలు ఇలా ఉంది.
1. మార్కెట్ లో డబ్బుల కోసం మొదటి విడతగా TLTRO2.0 - 50 వేల కోట్లు విడుదల.
2. చిన్న, సహకార బ్యాంక్ లోన్ల రీ ఫైనాన్సింగ్ కోసం 50 వేల కోట్లతో మొదలు
3. రివర్స్ రెపో రేటు 4 నుంచి 3.5 శాతానికి తగ్గించారు.
4. రెపో రేటును 25 బేస్ పాయింట్లు తగ్గించనున్నారు
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple