కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో ఆహార ధరలు విపరీతంగా పెరిగాయని, భారత్లో ఏప్రిల్ నెలలో ఆహార ధరలు ఏకంగా 2.4శాతం పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ఈరోజు ఉదయం 10గంటలకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2021-22లో భారత్ 7.4శాతం వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపర్చడానికి ఆర్బీఐ అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితుల్లోనూ భారత్ 1.9శాతం సానుకూల వృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అనేక రంగాలను ఆదుకోవడానికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మాగాంధీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. *మరణం మధ్యలో జీవితం కొనసాగుతోంది. అసత్య సత్యం మధ్యలో కొనసాగుతోంది. చీకటి మధ్యలో వెలుగు రేఖ వస్తుంది* అని గాంధీని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మానవాళి అతిపెద్ద సవాలును ఎదుర్కోందని, ఈ చీకటిని తరిమికొట్టేందుకు మనం కంకణబద్ధులం కావాలని, ఆ దిశగా కదలాలని ఆయన సూచించారు.