తబ్లిగీ జమాత్ మర్కజ్ నేత మౌలానా సాద్ ఖందల్వి ఇవాళ ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. మర్కజ్ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు సహ కరిస్తున్నానని, ఆ విచారణలో మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ లేఖలో తెలిపారు. మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారు దేశ వ్యాప్తంగా వ్యాపించారు, వారి నుంచే అధిక సంఖ్యలో కరోనా వైరస్ కేసులు బయటపడుతున్న విషయం తెలిసిందే. మీరు పంపిన రెండు నోటీసులకు స్పందించానని 56 ఏళ్ల తబ్లిగీ నేత క్రైం బ్రాంచ్ పోలీసులకు లేఖ రాశారు. నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను, విచారణకు సహకరిస్తానని ఆయన ఏప్రిల్ 16వ తేదీన రాసిన లేఖ ఢిల్లీ పోలీసులకు చేరింది.
వేల మంది ఇస్లామిక్ మతస్థులతో ఖందల్వి.. నిజాముద్దీన్లోని మర్కజ్ బిల్డింగ్లో భారీ సమావేశాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసును పెట్టారు. ఆ కేసులో సెక్షన్ 304ను కూడా జత చేశారు. ఐపీసీలోని కల్పబుల్ హోమిసైడ్ను కూడా అతనిపై బుక్ చేశారు. దీని కింద అత్యధికంగా పదేళ్ల జైలు శిక్షపడే అవకాశాలు ఉంటాయి.
విచారణకు సహకరిస్తా.. ఢిల్లీ పోలీసులకు మర్కజ్ చీఫ్ లేఖ https://t.co/UFaKq9TaET
— NamasteTelangana (@ntdailyonline) April 18, 2020