కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మానవ సంబంధాలను పూర్తిగా మరిచిపోయింది. కన్న బిడ్డలను కనీసం తాకలేని పరిస్థితిలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇక వైద్యులు, పోలీసులు, సైనికులు సహా మరికొందరు సిబ్బంది పిల్లలను కనీసం తాకలేని స్థితిలో ఉన్నారు. 

 

తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. కరోనా నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్‌లో ఉన్న బిడ్డను హృదయానికి హద్దుకుని కన్నీళ్లు పెడుతున్న జవాన్‌ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో ని తెరాస రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తన బిడ్డ మీద ఉన్న మమకారాన్ని ఈ విధంగా చాటుకున్నారు ఆ జవాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: