ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్తంభించిపోయాయి. దానితో పాటే రవాణా వ్యవస్థ కూడా స్థంభించి పోయింది.. కాకపోతే కొన్ని వాహనాలు పరిమిట్ తీసుకొని నడుపుతున్నారు. తాజాగా వరంగల్ అర్భన్ జిల్లా రాంపూర్ హైవే పై కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న భార్యా భర్తలను కారు ఢీ కొట్టడంతో ఎగిరి అవతల పడి అక్కడిక్కడే మృతి చెందారు.
గత నెల రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గిపోయిందని అనుకుంటున్న సమయంలో ఈ కారు ప్రమాదం అందరి హృదయాలను కలచి వేసింది. ఒక్కసారే ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందడంతో విషాదం చోటు చేసుకుంది. సీసీ కెమెరాల ఆధారంగా కారు వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.