ఏపీ మాజీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమేష్ కుమార్ పదవీ కాలాన్ని తగ్గించడం పై హైకోర్ట్ లో దాఖలైన పిటీషన్ల కు గానూ కోర్ట్ ఆదేశాలతో ఏపీ సర్కార్ కౌంటర్ దాఖలు చేసింది. ఏపీ సర్కార్ ప్రధాన కార్యదర్శి తరుపున పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వివేది కామన్ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. 

 

అన్ని కేసులకు కలిపి కామన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తున్నామని ఆయన పిటీషన్ లో ప్రస్తావించారు. సీఎస్ తరఫున అఫిడవిట్ దాఖలుకు అనుమతులు ఉన్నాయని అఫిడవిట్‌లో ఆయన స్పష్టం చేసారు. కౌంటర్ దాఖలకు గాను ప్రభుత్వం గడువు కోరిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: