ఇటీవ‌ల ఫేస్‌బుల్ లైవ్‌లో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బాలీవుడ్ న‌టుడు అజాజ్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అజాజ్ ఖాన్ పై ఐపీసీ సెక్ష‌న్ 153ఏ, 117, 121ల (ప‌రువు న‌ష్టం, విద్వేష‌పూరిత ప్ర‌సంగం) కింద‌ కేసు న‌మోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత‌కీ అజాజ్‌ఖాన్ ఫేస్‌బుల్ లైవ్ ఏం మాట్లాడంటే.. * ఒక‌వేళ చీమ చ‌నిపోతే..ముస్లిందే ఆ బాధ్య‌త‌. ఏనుగు చ‌నిపోయినా ముస్లిందే బాధ్య‌త‌. ఢిల్లీలో భూకంపం వ‌చ్చినా ముస్లిందే బాధ్య‌త‌. అంటే ఏ ట‌న‌కైనా ముస్లిం బాధ్య‌త వ‌హిస్తాడ‌న్న‌మాట‌. మ‌రి ఈ కుట్రకు ఎవ‌రు కార‌ణ‌మ‌ని మీరెప్పుడైనా ఆలోచించారా..?* అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. దీనిపై పోలీసులు స్పందించి ఆయ‌నపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

 

ఈ విష‌యం ఇప్పుడు బాలీవుడ్‌లో వైర‌ల్ అవుతోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని త‌బ్లిఘీ జ‌మాత్ ఉదంతం వెలుగు చూసిన త‌ర్వాత దేశ వ్యాప్తంగా కరోనా వైర‌స్ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో ముస్లింల వ‌ల్లే.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి జ‌రుగుతోందంటూ సోష‌ల్ మీడియాలో దుష్ర్ప‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అజాజ్ ఖాన్ స్పందించార‌నే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: