యూపీకి చెందిన సోనూ కుమార్ చౌహాన్ పంజాబ్లోని లుధియానాలోని టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఏప్రిల్ 15న సోనూ పెళ్లి నిశ్చయం అ యింది. అయితే లాక్డౌన్ కారణంగా సోనూ పంజాబ్లోనే చిక్కుకుపోయాడు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడడంతో ఎలాగైనా వెళ్లాలని భావించాడు. నేపాల్ సరిహద్దులో ఉన్న మహారాజ్గంజ్ జిల్లాలో సోనూ పెళ్లి జరగనుంది. అయితే లాక్డౌన్తో రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దవడంతో తమ సొంత బైకులపై ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. సోనూ తన ముగ్గురు స్నేహితులతో కలిసి లుధియానా నుంచి రెండు బైక్లపై బయలుదేరారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దాదాపు 850 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు.
ఇంకా 150 కిలోమీటర్లు చేరితే గమ్యస్థానం చేరుకుంటామనేలోపు ఆదివారం ఉదయం యూపీలోని బలరామ్పూర్ వద్దకు రాగానే పోలీసులు అడ్డుకు న్నారు. సోనూతో సహా మిగతా ముగ్గురిని క్వారంటైన్కు తరలించారు. 'ఈ సమయంలో ఇలాంటి ప్రయాణం చేయడం రిస్కే. కానీ పెళ్లి కావడంతో ఈ పని చేయాల్సి వచ్చింది. ఇంకో 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మా ఊరికి వెళ్లేవాడిని. కానీ పోలీసు అధికారులు అడ్డుకొని ఇప్పుడు నీ పెళ్లి కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ క్వారంటైన్ సెంటర్కు తరలించారని' సోనూ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.