లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోని ప్రజలు ఇంటికి అవసరమైన నిత్యావసరాలను తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ పక్క రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో పక్క ఊర్లకు వెళ్ళి కూడా ఆహార పదార్థాలు తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది. కరోనా వైరస్ ను తట్టుకోవడానికి రోగనిరోధకశక్తిని పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఎటువంటి పండ్లు అందుబాటులో లేవు. పొలంలోని ని పంటలు మార్కెట్ లోకి రాక పొలంలోనే నాశనం అయిపోతున్నాయి.
వినూత్నంగా వాక్ ఫర్ వాటర్ సంస్థ వారు తమకు మిస్డ్ కాల్ ఇస్తే పండ్లు ఫలాలను తమ ఇంటి వద్దకే చేరుస్తాం అంటున్నారు. మరియు అందుకుగాను టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఈ సంస్థ ఏర్పాటు చేసింది. పండ్లు అవసరమైన వాళ్ళు 8875351555 నంబర్ కు ఒక మిస్డ్ కాల్ ఇస్తే పండ్లను తమ ఇంటి వద్దకే చేరుస్తామని చెబుతున్నారు. వాక్ ఫర్ వాటర్ సంస్థ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వాక్ ఫర్ వాటర్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఫామ్ టు హోం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి అని ఆయన తెలిపారు. ఇంకెందుకాలస్యం ఒక మిస్డ్ కాల్ తో పండ్లను ఇంటి వద్దకు తెప్పించుకోండి.
మిస్డ్ కాల్ ఇస్తే మీ ఇంటికే పండ్లు -88753 51555 నంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే ఇంటివద్దకే పండ్లు .. వాక్ ఫర్ వాటర్ సంస్థ ప్రయత్నాన్ని అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .వాక్ ఫర్ వాటర్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వ ఫామ్ టు హోం సేవలు. pic.twitter.com/ifynhqF2np
— IPRDepartment (@IPRTelangana) April 20, 2020