కరోనా నేపథ్యంలో వాస్తవంగా చెప్పాలంటే దేశంలోనే తెలంగాణలోనే అత్యంత కఠినమైన నిబంధనలు అమలు అవుతున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎవ్వరిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అయినా చాలా మంది నిబంధనలు అతిక్రమిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ అయితే మినహా రోడ్లపైకి రావొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా చాలా మంది ఇష్టం వచ్చినట్టు రోడ్లమీదకు వచ్చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 1.21లక్షల వాహనాలను సీజ్ చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
ఇన్ని వాహనాలు సీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. లాక్ డౌన్ తర్వాత ఈ వాహనదారులు కోర్టుకు వెళ్లి వాటిని తీసుకోవచ్చునని ఆయన సూచించారు. ఇందులో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని వాహనాలు ఉన్నాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలు చేయబోతున్నట్లు అంజనీ కుమార్ తెలిపారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple