వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ను.. ఇటు బీజేపీకీ చెందిన పలువురు నేతలను టార్గెట్గా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే విజయ సాయి కొద్ది రోజులుగా చంద్రబాబు, లోకేష్తో పాటు బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను సైతం టార్గెట్గా చేసుకుని విరుచుకు పడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు రు. 20 కోట్లకు అమ్ముడు పోయారని.. దీనికి సుజనా చౌదరి బ్రోకరిజం చేశారని కూడా విమర్శించారు.
ఇక తాజాగా మరోసారి సుజనాపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టిన విజయ సాయి సుజనా చౌదరి బ్యాంకులకు ఎగ్గొట్టిన కోట్లతో పాటు ఆ వడ్డీ లెక్కలు కూడా చెప్పారు. బ్యాంకుల నుంచి సుజనా చౌదరి 5,700 కోట్లు లూటీ చేశాడు. వడ్డీతో కలిపి ఆ మొత్తం 10,000 కోట్లకు చేరింది. బిజెపిలో కోవర్టు పనులు చేస్తూ, బాబు బానిసల పేమెంట్స్ చూస్తున్నాడు. తిరిగే కారు, వేసుకున్న బట్టలు, తినే తిండి అంతా బ్యాంకుల్లో ప్రజలు పొదుపు చేసుకున్న డబ్బుతోనే సుజనా కొన్నారని విమర్శించారు.
బ్యాంకుల నుంచి సుజనా చౌదరి 5,700 కోట్లు లూటీ చేశాడు. వడ్డీతో కలిపి ఆ మొత్తం 10,000 కోట్లకు చేరింది. బిజెపిలో కోవర్టు పనులు చేస్తూ, బాబు బానిసల పేమెంట్స్ చూస్తున్నాడు. తిరిగే కారు, వేసుకున్న బట్టలు, తినే తిండి అంతా బ్యాంకుల్లో ప్రజలు పొదుపు చేసుకున్న డబ్బుతో కొన్నవే సుజనా.
— Vijayasai reddy v (@VSReddy_MP) April 21, 2020