లాక్‌డౌన్ కార‌ణంగా సామాన్య‌ప్ర‌జ‌ల‌తోపాటు సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. ఇక సెల‌బ్రిటీలు అయితే.. ఇళ్ల‌లో త‌మ‌కు ఇష్ట‌మైన ప‌నులు చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా త‌నకు ఇష్ట‌మైన గుర్రంతో సెల్ఫీలు దిగి వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఆ గుర్రానికి ఎన్ని అంద‌మైన పేర్లు పెట్టిందో..!  సెల్ఫీకింగ్‌, స‌న్‌రైజ్ బ‌డ్డీ అంటూ దానిపై ముద్దులు కురిపించిదీ అమ్మ‌డు. దానిని ముద్దాడుతూ.. చిరున‌వ్వులు చిందిస్తూ తీసిన ఈ సెల్ఫీలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

 

నిజానికి.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు జంతువులు అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. వాటిని ఎంతో ప్రేమ‌గా చూసుకుంటుంద‌ట‌. అందుకే ఏమాత్రం స‌మ‌యం దొరికినా.. జంతుల‌తో సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గ‌డుపుతుంద‌ట‌. ఇక్క‌డ మ‌రొక ఇంట్రెస్టింగ్ విష‌యం కూడా ఉంది. ముంబైలోని అమెచ్యూర్ రైడర్స్ క్లబ్‌కు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ త‌రుచూ వెళ్తుంద‌ట‌. ఎందుకంటే.. అక్కడ ఆమె కొంతకాలం క్రితం రైడింగ్ పాఠాలు కూడా నేర్చుకుంది. అందుకే త‌న బిజీ లైఫ్‌లో ఏమాత్రం స‌మ‌యం దొరికినా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గుర్రపు స్వారీలో పాల్గొనడానికి వెళ్తుంద‌ట‌. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: