తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటంతో ముంద్రించిన మాస్క్లు వచ్చాయి. టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవాన్ని సూచించేలా కేసీఆర్ చిత్ర పటంతో తయారు చేసిన మాస్క్ ను ధరించిన ఫోటోలను ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విడుదల చేశారు. ఈ నెల 27తో టీఆర్ఎస్ పార్టీకి 20 ఏళ్లు నిండుతున్నాయి. ప్రతీసారి పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అయితే.. ఈసారి కరోనా కారణంగా సాదాసీదాగా పార్టీ శ్రేణులు జరుపుకోవాలని టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. సమాజహితం కోరుతూ మాస్క్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కోరారు. కేసీఆర్ చిత్ర పటంతో తయారు చేసిన మాస్క్లను ప్రజలకు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మాస్క్ లను ధరించిన ఫోటోలను తనకు షేర్ చేయాలని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ పార్టీ శ్రేణులకు, పార్టీ నాయకులకు సూచించారు. అయితే.. మాస్క్ల పంపిణీ సందర్భంగా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించాలన ఆయన సూంచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపులుగా చేరవద్దని ఆయన సూచించారు. కాగా, గతంలో ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం కూడా మంచి ఆదరణ పొందింది.
20 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సహచరులందరికి తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.....
— santosh kumar J (@MPsantoshtrs) April 22, 2020
27 ఏప్రిల్ రోజున పార్టీ మాస్కులు ధరిద్దాం, నిబంధనలు పాటిద్దాం ....#TRSParty#WearFaceMask #StaySafe #FightAgainstCoronaVirus pic.twitter.com/24d1tke0iv