ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి దంపతులపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ముంభైలోని తన కార్యాలయం నుంచి గురువారం తెల్లవారుజామున విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తనపై , తన భార్యపై బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని తమపైకి రసాయనాలు చల్లారని ఆర్నాబ్ వెల్లడించారు. అంతేగాక కాంగ్రెస్ గూండాలే తనపై దాడికి పాల్పడ్డారని, తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా సోనియా గాంధీ కుటుంబమే బాధ్యత వహించాలని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే ఈ ఘనటనలో గోస్వామి దంపతులకు గాయాలు కాలేదు. అర్నాబ్ గోస్వామి, సమియా గోస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. గోస్వామి నిన్న ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో విశ్వసనీయత లోపించిందని ఆరోపిస్తూ రాజీనామా చేసిన సంగతి తెలి సిందే. మహారాష్ట్రలోని పాల్ఘార్లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్పై గుంపు దాడి ఘటనపై టీవీ లైవ్ చర్చలో అర్నబ్ తన రాజీనామాను ప్రకటించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసినట్లు ముంబై జోన్ 3 డీసీపీ ప్రకటించారు.
ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి దంపతులపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ముంభైలోని తన కార్యాలయం నుంచి గురువారం తెల్లవారుజామున విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తనపై , తన భార్యపై బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని తమపైకి రసాయనాలు చల్లారని ఆర్నాబ్ వెల్లడించారు. అంతేగాక కాంగ్రెస్ గూండాలే తనపై దాడికి పాల్పడ్డారని, తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా సోనియా గాంధీ కుటుంబమే బాధ్యత వహించాలని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే ఈ ఘనటనలో గోస్వామి దంపతులకు గాయాలు కాలేదు. అర్నాబ్ గోస్వామి, సమియా గోస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. గోస్వామి నిన్న ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాలో విశ్వసనీయత లోపించిందని ఆరోపిస్తూ రాజీనామా చేసిన సంగతి తెలి సిందే. మహారాష్ట్రలోని పాల్ఘార్లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్పై గుంపు దాడి ఘటనపై టీవీ లైవ్ చర్చలో అర్నబ్ తన రాజీనామాను ప్రకటించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసినట్లు ముంబై జోన్ 3 డీసీపీ ప్రకటించారు.