"నీ క‌ల్లు నీలి స‌ముద్రం ... నా మ‌న‌సేమో అందుట్లో ప‌డ‌వ ప్ర‌యాణం"వంటి హిట్ సాంగ్స్‌తో రిలీజ్‌కు ముందే క్రేజ్ సంపాదించుకున్న చిత్రం "ఉప్పెన"‌‌.   ‌ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా కరోనా కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణ‌వ్ తే జ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ యెర్నేని,  రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.. కృతీశెట్టి క‌థానాయిక‌గా ప‌రిచ‌యమ‌వుతోంది. త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఇందులో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. 

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ లెటెస్ట్ న్యూస్ ఇండ‌స్ట్రీలో మార్మోగిపోతోంది.  విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రం త‌మిళ రీమేక్ హ‌క్కులు కొన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఓ మంచి ప్రేమ క‌థ‌తో త‌న కొడుకును హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని చూస్తున్న స్టార్ హీరో విజ‌య్‌కు క‌థ వినిపించిన‌ట్లు తెలుస్తోంది.  ఈ సినిమాపై విజ‌య్ కూడా ఆస‌క్తి క‌న‌బర్చ‌గా, త‌న కొడుకు జాస‌న్ సంజ‌య్ విదేశాల నుంచి తిరిగి రాగానే మ‌రోసారి చ‌ర్చించి దాదాపు సినిమాకు ఓకే చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కెన‌డాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్న సంజ‌య్ అది పూర్త‌వ‌గానే ఈ సినిమాలో న‌టించే అవ‌కాశాలు‌న్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: