దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం సచిన్ 47వ పడిలోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ తరుణంలో పుట్టిన రోజు వేడుకలు జరుపు కోకూడదని ఆయన నిర్ణయం తీసు కున్నాడట. ‘జన్మదిన వేడుకలకు ఇది సరైన సమయం కాదని సచిన్ భావిస్తున్నాడు. కరోనాపై ముందు వరుసలో నిలిచి పోరాడుతున్న డాక్టర్లు, న ర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు, రక్షణ సిబ్బందికి మద్దతు ఇవ్వడానికి ఇంతకంటే మంచి మార్గం లేదనుకుంటున్నాడు.’ అని సచిన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కాగా ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ టెండూల్కర్ కరోనాపై పోరాటానికి పీఎం, సీఎం సహాయ నిధికి మొత్తం రూ.50 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తె లిసిందే. అలాగే కరోనాపై అవగాహన కార్యక్రమాల్లోనూ ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నాడు.