ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో సినిమా ప్ర‌ముఖులు అంద‌రూ ఇళ్ల‌ల్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ ఏడాది నాలుగు ఆస్కార్ అవార్డులను సాధించిన కొరియన్ చిత్రం పారాసైట్‌ బోరింగ్‌గా అనిపించిందని ఓ టీవీ ఛానెల్ లైవ్‌లో వ్యాఖ్యానించారు. అయితే దీనిపై నెట్టింట్లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. ఈ సినిమా చూస్తూ తాను మ‌ధ్య‌లోనే నిద్ర‌పోయాన‌ని.. త‌ర్వాత త‌న భార్యసినిమా క‌థ చెప్పినా కూడా త‌న‌కు అంత ఇంప్రెసింగ్ అనిపించ‌లేద‌ని చెప్పాడు.

 

అయితే రాజ‌మౌళి వ్యాఖ్య‌ల‌పై మిఠాయి మూవీ దర్శకుడు ప్రశాంత్ కుమార్‌ స్పందించారు. మీ మూవీల్లో చాలా కాపీలు ఉన్నాయి. బాహుబలి గురించి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు తానెక్క‌డా విన‌లేదు.. చూడ‌లేద‌ని కూడా ఘాటుగా కామెంట్లు చేశాడు. దీనిపై మ‌రోసారి స్పందించిన రాజ‌మౌళి పారాసైట్ నాకు నచ్చకపోవడమన్నది వ్యక్తిగత అభిప్రాయం. గతంలో కూడా చాలా ఆస్కార్ సినిమాలు నాకు నచ్చనివి ఉన్నాయి. చాలా నచ్చినవీ ఉన్నాయి అని జక్కన్న వివరించారు.

 

అలాగే ఆస్కార్ అవార్డులు ఇచ్చే అకాడమీ జ్యూరీ ప్రమాణాలపై తనకు పూర్తిగా నాలెడ్జ్ లేదని ఆయన వివరించారు. రాజ‌మౌళి ఆన్స‌ర్ మిఠాయి లాంటి అడ్ర‌స్ లేని సినిమా తీసిన ప్ర‌శాంత్‌కు చెంప ప‌గిలేలా ఉంద‌ని ఇప్పుడు నెట్టింట్లో కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: