టాలీవుడ్‌లో బీ ద రియ‌ల్ మ్యాన్ ఛాలెంజ్ ఉత్సాహంగా కొన‌సాగుతోంది. నిన్న హీరో వెంక‌టేశ్ విసిరిన స‌వాల్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి స్వీక‌రించారు. *ఇంట్లో వాళ్ళకి కొంత ఫ్రస్ట్రేషన్ రిలీఫ్. మనకి కొంత ఫన్* అంటూ ఇంటి ప‌నులు చేశాడు. ముందుగా బోళ్లు తోమి క‌డిగాడు. ఆ త‌ర్వాత ఇళ్లంతా తుడిచాడు. ఆ త‌ర్వాత‌.. దుప్ప‌ట్లు మ‌డ‌తేసి, కూర‌గాయలు క‌ట్ చేశాడు. ఇంటి ఆవ‌ర‌ణ‌లోని మొక్క‌ల‌కు నీళ్లు పోశాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఇక్క‌డ ఆయ‌న మ‌రో ముగ్గురిని నామినేట్ చేశాడు. నంద‌మూరి క‌ల్యాణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ‌, ర‌వితేజ‌కు స‌వాల్ విసిరాడు. ఇక ఈ స‌వాల్‌ను నంద‌మూరి క‌ల్యాణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ‌, ర‌వితేజ స్వీక‌రించి, ఎలాంటి ప‌నులు చేస్తారో చూడాలి మ‌రి.

 

అంత‌కుముందు జూనియ‌ర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి, హీరో వెంక‌టేశ్‌ల‌కు ఛాలెంజ్‌ను విసిరిన విష‌యం తెలిసిందే. ఇక చిరంజీవి వీడియో విడుద‌ల చేసేముందు వెంకీ మామా.. ఐయామ్ కమింగ్ అంటూ ఓ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఆ  కొద్దిసేప‌టికే ఇంటిప‌నులు చేసి, పెస‌ర‌ట్టు ఉప్మాను త‌యారు చేసి త‌ల్లికి తినిపించిన వీడీయోను పోస్టు చేశారు. ఇక ఆ త‌ర్వాత వెంక‌టేశ్ కూడా వీడియోను పోస్ట్ చేసి అనిల్‌రావిపూడికి స‌వాల్ విసిరారు. అయితే.. ఇప్పుడు హీరో ర‌వితేజ వీడియో కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: