క‌రోనా క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌గా కొత్త సినిమా ఎలా రిలీజ్ అయింద‌ని అనుకుంటున్నారా..?  నిజ‌మే కొత్త సినిమా విడుద‌ల అయింది.. అయితే. పోన్ మ‌గ‌ల్ వంధ‌ల్‌ సినిమాని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల చేశారు. ఇది ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుద‌ల చేశారు. ఇలా విడుద‌ల అయిన మొద‌టి త‌మిళ చ‌ల‌న‌ చిత్రం ఇదేన‌ట‌. ఈ సినిమా రైట్స్‌ను ప్రైమ్ వీడియో పొందింది. మే  మొద‌టి వారం నుంచి ప్ర‌సారం కానుంది. ఈ చిత్రంలో జ్యోతిక కీ రోల్ పోషిచింది. అయితే.. క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితులు సినిమా రంగాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేశాయి.

 

మ‌రో ఐదారు నెల‌ల‌పాటు కొత్త సినిమాలు వ‌చ్చే ప‌రిస్థితులు లేవు. ఒక‌వేళ వ‌చ్చినా జ‌నం మాత్రం థియేట‌ర్ల‌కు రావ‌డం క‌ష్ట‌మే. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుద‌ల చేయ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. జ‌నం థియేట‌ర్ల‌కు రాన‌ప్పుడు ఇలా విడుద‌ల చేయ‌డం ఒక్క‌టే మంచిమార్గ‌మ‌ని చెబుతున్నారు. మ‌రి జ్య‌తిక న‌టించి ఈ సినిమా ఏమేర‌కు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందో చూడాలి మ‌రి. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల అయిన మొద‌టి సినిమా సిలా స‌మాయంగ‌లిల్ అని మ‌రికొంద‌రు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: