క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి వైసీపీ ప్ర‌భుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేద‌ని, పూస్తి స్థాయిలో క‌రోనా కేసుల‌ను బ‌య‌ట‌కు చెప్ప‌డంలేద‌ని టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌దేప‌దే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీ నేత‌లు కూడా బాబోరికి గ‌ట్టిగానే స‌మాధానం చెబుతున్నారు. ఇవిగో లెక్క‌లంటూ ఇప్ప‌టికే ప‌లు మార్లు లెక్క‌లు కూడా చూపించారు. ఇలా నిత్యం వైసీపీ నేత‌లు, చంద్ర‌బాబు మ‌ధ్య వాగ్వాదం జ‌రుగుతూనే ఉంది. ఈక్ర‌మంలోనే చంద్ర‌బాబుపై వైసీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇందులో బాబోరిని బాగానే ఏకిపారేశారు.

 

*కోవిడ్ తీవ్రతను కప్పిపెడుతున్నారని బాబు కడవల కొద్ది కన్నీరు కార్చినా ఎవరూ నమ్మడం లేదు. బానిస విశ్వాసంతో కిరసనాయిలు అటుతిప్పి ఇటుతిప్పి బాబు ఆరోపణను ప్రతి వార్తకు లింకు పెట్టి వదులుతున్నాడు. దాస్తే కనపడకుండా పోవడానికి మీ బినామీ ఆస్తులు, బ్లాక్ మనీ కాదు* అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. బాబుగారు తానా అంటే.. తందానా అనే ఆ ప‌త్రికా య‌జ‌మానికి గ‌ట్టిగానే చుర‌క‌లు అంటించారు. ఇక దీనిపై బాబుగారు, ఆయ‌న బ్యాచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: