క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న‌ లాక్‌డౌన్ నుంచి కేంద్ర ప్ర‌భుత్వం మ‌రికొన్ని స‌డ‌లింపుల‌ను ఇచ్చింది. ప్ర‌జ‌ల నిత్యావ‌స‌రాలు తీర్చేలా స్థానికంగా ఉన్న షాపుల‌ను తెర‌చుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ప్రజలకు అవసరమైన గూడ్స్‌ సరఫరకు కేంద్రం అనుమతినిచ్చింది. ఇక‌ నాన్‌ హాట్‌స్పాట్‌ ఏరియాలోని మున్సిపాలిటీ పరిధిలో గల దుకాణాలను తెర‌వొచ్చు. ఇక మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిమితిలో ఉన్న మార్కెట్ సముదాయాలకు మాత్రం అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఇక్క‌డ ఎప్ప‌టిలాగే ఆంక్ష‌లు కొన‌సాగుతాయి. అయితే తెరుచుకునే షాపులకు మాత్రం షరతులు కూడా విధిస్తూ శుక్ర‌వారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవాలని తెలిపింది. క‌రోనా వైర‌స్ హాట్‌ స్పాట్‌, కంటైన్మెంట్‌‌ జోన్లు ఉన్న చోటమాత్రం ఏషాపులూ తెరవడానికి వీలేద్దని కేంద్రం పేర్కొంది.

 

ఇప్పటి వరకు కిరాణా దుకాణాలు, నిత్యవసర, అత్యవసర, మందుల, ఫార్మసీలకు మాత్రమే అనుమతి ఉంది. తాజా సడలింపులతో స్టేషనరీ,  బ్యూటీ సెలూన్స్‌, డ్రైక్లీనర్స్‌, ఎలక్టికల్‌ స్టోర్స్‌ తెరుచుకోవ​చ్చు. అయితే  ఇవన్నీ ఆయా రాష్ట్రా ప్రభుత్వాల అనుమతితో మాత్రమే జరగాలని కేంద్ర స్పష్టం చేసింది. అయితే తెరుచుకోబడిన ఆయా షాపుల్లో కేవలం​ 50శాతం మంది సిబ్బంధి మాత్రమే విధులు నిర్వర్తించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ముఖాలకు మార్క్‌లు, శానిటైజర్లు, సామాజిక దూరం తప్పనిసరి పాటించాలని చెప్పింది. ఇక ఇదే స‌మ‌యంలో షాపింగ్ మాల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు. మరికొంతకాలంపాటు వీటిపై ఆంక్షలు కొనసాగనున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: