మాన‌వ నిర్మితాల్లో తెలంగాణ‌లోని కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం. ఈ ప్రాజెక్టులో భాగంగా నిన్న‌ మ‌రో అపురూప ఘ‌ట్టం ఆవిష్కార‌మైంది. గోదావరి జ‌లాలు ప‌రుగులు పెడుతూ సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ను ముద్దాడాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి గోదావరిజలాలు రంగనాయకసాగర్‌లోకి వచ్చేశాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్‌ శివారులో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏడో దశ రంగసాయక సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పంప్‌హౌస్‌ల వెట్‌రన్‌ను ప్రారంభించడంతో గోదావ‌రి జ‌లాలు సిద్దిపేట జిల్లాలో అడుగుపెట్టాయి. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టుతో సిద్ధిపేట నియోజకవర్గంలో సుమారు 71,516 ఎకరాలకు సాగునీరు అందనుంది. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మూడు టీఎంసీలు. అలాగే.. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని లక్షా 14వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

 

ఈ సంద‌ర్భంగా నిన్న‌టి నుంచి అనేక మంది కాళేశ్వ‌రం ప్రాజెక్టు జ‌ల‌దృశ్యాల వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. టీఆర్ఎస్ నేత‌, ఎంపీ సంతోష్‌కుమార్ వెట‌ర‌న్‌కు సంబంధించిన అద్భుత‌మైన వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.  ఎగిసిప‌డుతున్న గోదావ‌రి జ‌లాలు క‌నువిందు చేస్తున్నాయి. తాజాగా.. మ‌రో అద్భుత‌మైన వీడియో వైర‌ల్ అవుతోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని తొమ్మిది పంపౌజ్‌ల‌కు సంబంధించిన జ‌ల‌దృశ్యాల‌ను ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తూ రూపొందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: