కొవిడ్-19 ఇటలీలో విలయతాండవం చేస్తోంది. కరోనా మహమ్మారి ధాటికి దేశం మొత్తం కకావికలం అవుతోంది. వైరస్ కారణంగా ఇప్పటికే వేలాది ప్రజల తోపాటు, 150 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదు అయిన వైరస్ కేసుల్లో పది శాతం మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నట్లు సంఘం పేర్కొంది. అయితే తాజాగా అక్కడ ప్రభుత్వం .. డాక్టర్ల రక్షణ కోసం ఓ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిపై మరో డాక్టర్ల సంఘం నిరసన వ్యక్తం చేసింది.
వైద్యశాఖకు కేటాయించిన 25 బిలియన్ల యూరోలు ఏ మాత్రం సరిపోవు అని కొందరు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. కరోనా వేళ పేషెంట్లు సునామీలా హా స్పటిళ్లకు వచ్చారని, ఇప్పటికే హెల్త్ కేర్ వ్యవస్థకు నిధులు సరిగా అందడంలేదని వైద్యులు విమర్శిస్తున్నారు. మరోవైపు కోవిడ్-19 మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇక్కడే మూడో వంతు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య నాలుగో వంతుగా ఉంది.